నందిగామ నవంబర్ 19: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని షాద్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంతో పాటు పిట్టలగూడ, చాకలిదానిగుట్టతండా, రంగాపూర్, సలివేంద్రిగూడ, మేకగూడ, సంఘిగూడ గ్రామాల్లో ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి అంజయ్యయాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో అంజయ్యయాదవ్కు మద్దతుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పాల్గొన్నారు. అంజయ్యయాదవ్, సుభాష్రెడ్డిలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అంజయ్యయాదవ్ మాట్లాడుతూ కష్టపడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ఈట గణేశ్, మాజీ వైస్చైర్మన్ నవీన్రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు పద్మారెడ్డి, సర్పంచ్లు రాజునాయక్, రమేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు మంజులారెడ్డి, రాజ్గోపాల్, అశోక్, మాజీ చైర్మెన్ విఠల్, మాజీ ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు రాంరెడ్డి, నీలమ్మ, రవి, చంద్రయ్య, కుమార్గౌడ్, గోపాల్రెడ్డి, జనార్దన్రెడ్డి, గబృచౌహాన్, కిషన్, కృష్ణయ్య, సురేశ్, శ్రీనివాస్రెడ్డి, బాల్రెడ్డి, గోవు రవి, ఆంజనేయులు, భాస్కర్, హనుమంత్రావు, గణేశ్, చంద్రశేఖర్, నర్సింహ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.