రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని రంగారెడ్డి జిల్లా పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన పథకాలతో ప్రజల జేబులు నింపుతుంటే.. కేంద్ర సర్కార్ పేదలను దోచి పెద్దలకు పెడుతున్నదని మండిపడ్డారు. దీనిపై ప్రశ్నిస్తే రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు.
బీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ తొమ్మిదేండ్లుగా గడప గడపకూ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, మరోసారి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే నందిగామ మండలం మామిడిపల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజల కష్టాలు తెలిసిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని.. అందుకే అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.
రంగారెడ్డి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)/శంకర్పల్లి : రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్య మని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శంకర్పల్లి మం డలం, మోకిల గ్రామంలోని రవీందర్రెడ్డి గార్డెన్లో సోమవారం ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజూనాయక్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జయప్రదమైంది.
ఈ కార్యక్రమానికి 11 గ్రామాల (మియాగూ డ, జన్వాడ, ఇర్రుకుంటతం డా, దొంతన్పల్లి, మహరాజ్పేట, గోపులారం, పిల్లిగుండ్ల, మోకిల, మోకిలతండా, కొండకల్, శేరిగూడ) నుంచి దాదాపుగా నాలుగు వేల మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీలు ఎల్.రమణ, పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాద య్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంకా ప్రజలకు చేరాల్సిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఏమైనా ఉన్నాయా? లోటుపాట్లు ఏమైనా జరుగుతున్నా యా? ప్రజల యోగక్షేమాలు, మన పార్టీ రేపటి కార్యాచరణ ఏమిటి అనే నేపథ్యంలోనే ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తూ.. ప్రజలపై అదనపు భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ.. దేశాన్ని అదానీకి దోచిపెడుతున్నదని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తూ భయపడుతున్నదన్నా రు. బీజేపీ పాలనలో రాష్ర్టానికి ఒరిగేందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా, వృద్ధాప్య, వితంతు తదితర పింఛన్లతోపాటు కులవృత్తులు అంతరించి పోకుండా చర్యలు తీసుకుంటున్నారన్నా రు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేవెళ్ల నియోజకవర్గం ఎంతో మారిందని.. అభివృద్ధిపథంలో ముం దుకు దూసుకెళ్తున్నదన్నారు.
మన ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రేపటి తెలంగాణ భవితవ్యం గురించి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తూ, తెలంగాణలో అన్ని ప్రాంతాలు పురోగమనంలో దూసుకుపోయేలా రూ. వేల కోట్ల విదేశీ పెట్టుబడులను రాష్ట్రంలోకి ఆహ్వానిస్తున్నారని.. దీంతో చేవెళ్ల ప్రాంతం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఇప్పటికే చేవెళ్లలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీతోపాటు పలు పరిశ్రమలు ఏర్పాటైనట్లు ఆయన తెలిపారు. 2014లో ఉన్న చేవెళ్ల ప్రాంతానికి, ఇప్పటి చేవెళ్లకు ఎంతో తేడా ఉన్నదన్నారు.
రానున్న రోజుల్లో రంగారెడ్డి జిల్లాలోనే చేవెళ్ల ఆదర్శ నియోజకవర్గంగా మారుతుందన్నారు. దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్ అని, ఆయనకు అండగా ఉండి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు సూచించారు. ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నా యని.. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, జడ్పీటీసీ గోవిందమ్మాగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ సరితారాజూనాయక్, ప్రజా ప్రతినిధులు, 11 గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళా కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ప్రజల మనిషి.. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కాలె యాదయ్య
సీఎం కేసీఆర్ ప్రజల మనిషి .. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నా రు. రైతు, ప్రజాసంక్షేమంగా ధ్యేయంగా భావించి ..రైతును రాజుగా చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందుతున్నదన్నారు. ఆడపడుచులు తమ కుమార్తెల వివాహాలు చేసేందుకు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ ఆదుకుంటున్నారన్నారు. అంతేకాకుండా వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు ప్రతినెలా పింఛన్లను అందిస్తూ అండగా నిలుస్తున్నారు. గతంలో ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలంటే భయపడే ప్రజలు.. నేడు సీఎం కల్పించిన వసతులతో సంతోషంగా వెళ్తున్నారన్నారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు.
పార్టీని మరింత బలోపేతం చేయాలి
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మనకు సంక్షేమ పాలన అందుతున్నది. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించింది. ఇంటింటికీ సంక్షేమ, అభివృద్ధి పథకా లు అందుతున్నాయి. ప్రజలందరూ సంతోషంగా జీవిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో చేవెళ్ల నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నది. ఇంకా పలు పెద్ద, పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ట్రం వైపు దేశమంతా చూస్తున్నది. పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం మనందరిపై ఉంది.
-పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. పల్లెప్రకృతి కార్యక్రమం తో గ్రామాలకు కొత్త కళ వచ్చింది. ఊర్లు స్వచ్ఛతకు మారుపేరుగా మారాయి. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. బంగా రు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యం
-ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, శంకర్పల్లి
మరోసారి అధికారంలోకి తీసుకురావాలి
సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజల అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇంటింటికీ ్రఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. ప్రజలందరూ సంతోషంగా జీవిస్తున్నారు.
-రాజూనాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్
ప్రజలు సంతోషంగా ఉన్నారు
ప్రభుత్వ పథకాలను పొందుతూ ప్రజలు చాలా సం తోషంగా జీవిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో గ్రా మాలు ఎంతో అభివృద్ధి చెందాయి. పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాలకు కొత్త కళను తీసుకొచ్చింది. ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగుతున్నది. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి.
– రవీందర్ గౌడ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు..
రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. ఈ ప్రభుత్వ హయాంలోనే శంకర్పల్లి నుంచి హైదరాబాద్కు వెళ్లే రోడ్లన్నీ విశాలంగా మారాయి.
-ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు
రైతులకు అండగా ప్రభుత్వం
ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ సకాలంలో వ్యవసాయ పనులు చేసుకునేలా సహకరిస్తున్నది. అంతేకాకుండా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతినెలా పింఛన్ను అందిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నది. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి.
-కురుమ వెంకటేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్
సీఎం కేసీఆర్కు మద్దతుగా ఉండాలి
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ, అభివృద్ధి పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఇతర పార్టీల నాయకులు చేసే అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉండి ఆయనకు అండగా నిలవాలి.
-గౌడిచర్ల వెంకటేశ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి
మహిళల అభ్యున్నతికి కృషి
మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. సయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. పేదలకు తమ కుమార్తెల వివాహాలు భారం కావొద్దనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి ఆడపడుచులకు అండగా నిలుస్తున్నారు.
– సరితా రాజూనాయక్, మోకిల ఎంపీటీసీ