ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ రానున్న ఎన్నికల్లో మరోసారి షాద్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇప్పటివరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అందుతున్న సంక్షేమ పథకాలు, వెచ్చించిన నిధులు, మున్ముందు చేపట్టబోయే అభివృద్ధి పనులపై వెల్లడించిన పలు విషయాలు ఆయన మాటల్లోనే…
రైతును రాజును చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా షాద్నగర్ నియోజకవర్గానికి నీరు అందించి తీరుతాం. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ స్కూళ్లను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాం. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాల మంజూరుకాగా, ఐటీఐ కళాశాల ఏర్పాటుకూ కృషిచేస్తున్నా. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వందల కోట్లతో నియోజకవర్గ ప్రగతికి బాటలు వేస్తున్నా. మరోసారి విజయం సాధించి మరింత అభివృద్ధి చేస్తా. సీఎం కేసీఆర్కు విధేయుడిగా.. ప్రజలకు వారధిగా ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నా. నాకు మరోసారి టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
-షాద్నగర్, ఆగస్టు 25
పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి సాగు నీరు అందిస్తాం. ఇక్కడి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నది. నియోజకవర్గంలో విద్యారంగానికి పేద్ద పీట వేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాల్సి ఉన్నది. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. ఐటీఐ కళాశాలనూ ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నా. నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో రోడ్లు బాగుపడ్డాయి. వందల కోట్ల నిధులను వెచ్చించి నియోజకవర్గ ప్రగతికి బాటలు వేశాం. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ సహకారంతో మరింత ప్రగతి సాధించేందుకు కృషి చేస్తా . మారు భారీ మెజార్టీతో గెలుపొందుతానని నమ్మకం ఉన్నది… అని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ‘నమస్తే తెలంగాణ’ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
– షాద్నగర్, ఆగస్టు 25
ఎమ్మెల్యే : సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు. మళ్లీ టికెట్ ఇచ్చినందుకు పార్టీ అధినేతకు విధేయుడిగా ఉంటా. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశా. సీఎం కేసీఆర్, నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆశీర్వాదంతో రెండు సార్లు ఎమ్మెల్యేను అయ్యా. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం ఉన్నది.
ఎమ్మెల్యే : తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉన్నదో నియోజకవర్గ ప్రజలకు కండ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నది. అప్పట్లో కనీసం తాగుదామంటే గుక్కెడు నీరు దొరుకకుండే. కానీ ఇప్పుడు ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతున్నది. రూ.వందల కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. కొత్తగా రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలను నిర్మించాం. ప్రభుత్వ భవనాలనూ నిర్మించాం. పేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించాం. రైతు వేదికలు, కమ్యూనిటీ భవనాలను నిర్మించగా అందుబాటులోకి వచ్చాయి. నియోజకవర్గంలో 100 పడకల దవాఖాన ఏర్పాటైంది. డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి రావడంతో ఎంతో మందికి మేలు జరుగుతున్నది. గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు కాగా, మెరుగైన విద్య అందుతున్నది.
ఎమ్మెల్యే : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్లు వంటి పథకాలతో ప్రజల మెప్పు పొందాం. బీసీ బంధు, దళిత బంధు, కార్పొరేషన్ రుణాలు, విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వ సహకారం వంటి కార్యక్రమాలతో పేదలను రాష్ట్ర సర్కార్ ఆదుకుంటున్నది.
ఎమ్మెల్యే : అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వంపై విశ్వాసం ఉన్నది. రాష్ట్రం రాక ముందు కరెంట్ కోతలతో అన్నదాతలు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. సాగు మొదలు, పంట చేతికొచ్చేవరకు రాష్ట్ర సర్కార్ అండగా నిలుస్తున్నది. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు ఉచితంగా చేప విత్తనాల పంపిణీ, వ్యక్తిగత రుణాలు అందజేత వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా అమలవుతున్నాయి. సబ్బండ వర్ణాలు రాష్ట్ర సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఫిదా అయ్యారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం.
ఎమ్మెల్యే : సంక్షేమ, అభివృద్ధి పథకాలే బీఆర్ఎస్ విజయానికి సోపానాలు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాలను ఆదుకుంటున్నారు. రాష్ట్ర సర్కార్ విడుదల చేసిన రూ. కోట్ల నిధులతో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి.
ఎమ్మెల్యే : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నది. దండపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి కావాల్సి ఉన్నది. విద్యా రంగాన్ని మెరుగుపర్చేందుకు నియోజకవర్గంలో మరిన్ని ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాల్సి ఉన్నది. కేశంపేట మండలం గాంధీపాలెం నుంచి చౌదరిగూడ మండలం లాల్పహడ్ వరకు ఉన్న ప్రధాన రహదారులను మరింత ఆధునీకరించాల్సిన అవసరం ఉన్నది. మారుమూల ప్రాంతాలకు బీటీ రోడ్లను వేయాల్సిన ఉన్నది.