ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 6: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల భర్తీలో భాగంగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ముమ్మరంగా సాగుతున్నది.
430 మందికి ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో ప్రతిరోజూ రన్నింగ్, జంపింగ్, షాట్ఫుట్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. అంతేకా కుండా వారికి ప్రతిరోజూ పాలు, గుడ్లు, పండ్లను అందజేస్తున్నారు. ఇటీవల ఉచిత శిక్షణా శిబిరానికి ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్రావు, సీఐ రామకృష్ణ హాజరై అభ్యర్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.