ఇబ్రహీంపట్నం, ఆగస్టు 16 : నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, విద్యా శా ఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గురువారం విచ్చేస్తున్నారు. ఉదయం 10 నుం చి ప్రారంభమయ్యే మంత్రుల పర్యటనలు మధ్యాహ్నం 3గంటల వరకు ఇ బ్రహీంపట్నంలో కొనసాగనున్నాయి. అనంతరం వారు మహేశ్వరం నియోజకవర్గంలోకి వెళ్లనున్నారు. మంత్రులు ముందుగా ఉదయం 10గంటలకు నియోజకవర్గంలో రూ.2కోట్లతో నిర్మించిన అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అటు నుంచి లష్కర్గూడ గ్రామాల మధ్య రూ.5.50కోట్లతో నిర్మించనున్న వంతెన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడలో రూ.8 కోట్లతో నిర్మించనున్న వాటర్ట్యాంక్ను ప్రారంభించనున్నారు.
అనంతరం ఇంజాపూర్-తుర్కయాంజాల్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నాగార్జునసాగర్ రోడ్డు నుంచి వయా నాదర్గుల్ వరకు 8కిలోమీటర్ల రోడ్డును ప్రారంభించనున్నారు. 12గంటలకు బొంగుళూరు గేటు సమీపంలోని కళ్లెంజంగారెడ్డి ఫంక్షన్హాల్లో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం చెరువుకట్ట నుంచి బీడీఎల్ వరకు నిర్మించిన రోడ్డు పనులను ప్రారంభించనున్నారు. అలాగే, ఇబ్రహీంపట్నంలో ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలతో పాటు బాలుర వసతి గృహాన్ని ప్రారంభించనున్నారు.
2గంటలకు ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రిలో నిర్మించిన 100పడకల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇబ్రహీంపట్నంలో రూ.8కోట్లతో నిర్మించిన ఆర్డీఓ నూతన కార్యాలయ భవనాన్ని మంత్రులు ప్రారంభిస్తారు. అనంతరం యా చారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ఆస్పత్రి భవనానికి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిర్వహించనున్న మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నేడు మండల కేంద్రానికి మంత్రుల రాక..
మహేశ్వరం : మండల కేంద్రానికి గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మం త్రి హరీశ్రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హాజరు కానున్నారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజూనాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరిగౌడ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు మహేశ్వరం మండల కేంద్రంలో రూ.4కోట్లతో చేపట్టిన 30 పడకల ప్రభుత్వ దవాఖానను ప్రా రంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రంజిత్రెడ్డి, రంగారెడ్డి జి ల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తదితరులు రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు కోరారు.