మొయినాబాద్, మే 5 : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పుట్టిన రోజున ఓ విద్యార్థిని ఓ వినూత్న బహుమతినిచ్చి అభిమానాన్ని చాటుకున్నది. మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామానికి చెందిన బేగరి ప్రసన్నవాణి తోలుకట్టాలోని చేవెళ్ల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నది. ఆమె ఇచ్చిన కాస్మొటిక్స్ చార్జీలతో పోగు చేసుకున్న డబ్బులతో 20 నోట్ పుస్తకాలను కొనుగోలు చేసి మీర్పేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రికి పుష్ప గుచ్ఛానికి బదులుగా నోట్ పుస్తకాలు ఇచ్చింది..
బహుమతి స్వీకరించిన మంత్రి చిన్నారిని అభినందించి.. ఆశీర్వదించింది.. బొకేలకు బదులు పుస్తకాలు, నోట్బుక్కులు ఇస్తే..అవి పేదలకు పంచడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందని భావించినట్టు బాలిక అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా.. మంత్రి సబితారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు లేఖ పంపారు. ‘ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తున్న మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నా’.. అంటూ సీఎం ఆశీర్వదించారు. మంత్రి సబితారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు