రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం గిరిజనోత్సవం నింగినంటింది. ఆటపాటలు, సభలు, సహపంక్తి భోజనాలతో తండాలు సందడిగా మారాయి. ఆయా తండాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొని గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. మహేశ్వరంలోని పలు తండాల్లో జరిగిన వేడుకల్లో మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి పాల్గొని గిరిజనులకు అన్నం వడ్డించారు. ఆయా నియోజకవరాల్లోని తండాల్లో ఎమ్మెల్యేలు పలు అభివృద్ధి పనులు ప్రారంభించి గిరిజనోత్సవాల్లో పాల్గొన్నారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
మహేశ్వరం, జూన్ 17 : గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివా రం గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని పలు తండాల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు హాజరైన మంత్రి సబితారెడ్డి, జడ్పీచైర్పర్సన్ అనితారెడ్డికి గిరిజనులు ఘన స్వా గతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఉప్పుగడ్డతండా, పడమటితండా, రామచంద్రగూడతండాల్లో గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపనతోపాటు చిన్నతూప్ర, పెద్దమ్మతండాల్లో సీసీ, బీటీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. మండలంలో బంజారాభవన్ నిర్మాణానికి ప్ర భుత్వం రూ.2 కోట్లు కేటాయించిందని, త్వరలోనే భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా మార్చి సుపరిపాలనను అందిస్తున్నారని కొనియాడారు. ఈ తొమ్మిదేండ్లలో రూ.53 వేల కోట్లను ఎస్టీల అభివృద్ధికి కేటాయించినట్లు.. ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ను పది శాతానికి ప్రభుత్వం పెంచిందని తెలిపారు. త్వరలోనే గిరిజనులకు పోడు భూముల పట్టాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు.
గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని..ఆయనకు ఎల్లప్పుడూ గిరిజనులు అండగా ఉండి మరో సారి ఆశీర్వదించాలని సూచించారు. కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత, ఆర్డీవో సూరజ్కుమార్, తహసీల్దార్ మహమూద్అలీ, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకుడు యా దయ్య, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చంద్రయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశ్యాదవ్, ఎస్టీసెల్ అధ్యక్షుడు లచ్యానాయక్, నియోజకవర్గ కార్యదర్శి అంజ య్య,బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజూనాయక్, మార్కెట్ కమి టీ చైర్మన్ సురేందర్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ ఏఈ రాజేశ్వరాదేవి, ఎంపీడీవో నర్సింహులు, తుక్కుగూడ కౌన్సిలర్ రవీనాయక్, రైతుబంధు మండల చైర్మన్ రాఘవేందర్రెడ్డి, సర్పంచ్లు మోతీలాల్నాయక్, రాజూనాయక్, శివరాజునాయక్, అనితారవీనాయక్, సాలీవీరానాయక్, యాదయ్య, చం ద్రయ్య, రాజేశ్, లింగం, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు గిరిజనులు, నాయకులు పాల్గొన్నారు.