పహాడీషరీఫ్ : బీఆర్ఎస్ పార్టీతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha reddy) అన్నారు. పహాడీషరీఫ్ మున్సిపాలిటీ పరిధిలోని షాహీన్నగర్, ఉస్మాన్నగర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ (BRS) లో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమంతో పాటు మైనార్టీలకు (Minorities) పెద్దపీట వేస్తున్నారన్నారు. మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కారణమవుతున్నారరని పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా వందలాది కోట్ల రూపాయల వ్యయంతో కాలనీ, బస్తీలలో మౌలిక వసతులు సమకూర్చుతున్నామని వెల్లడించారు. ఇంటింటికి మంచి నీటి సరఫరా కోసం రిజర్వాయర్లు ఏర్పాటు చేయిస్తున్నామని వివరించారు.
బీఆర్ఎస్లో చేరిన నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తున్న అభివృద్ధి , చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు మైనార్టీ కాలనీ, బస్తీలలో సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ వారికి అండగా నిలబడేందుకు పార్టీలో చేరామని వెల్లడించారు.
నియోజకవర్గ బీఆర్ఎస్ తరపున సబితా ఇంద్రారెడ్డిని అభ్యర్థిగా కేసీఆర్ నియమించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇక్భాల్ బిన్ ఖలీఫా, నాయకులు అవినాశ్, మన్సూర్ అలీ తదితరులు పాల్గొన్నారు.