‘సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో రంగారెడ్డి జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నది.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో వేలాది కుటుంబాలు లబ్ధి పొందాయి.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది.. జిల్లాలో ఎన్నో పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చింది..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మంత్రి మాట్లాడారు. రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకంతో సాగు, తాగు నీటి సమస్య తీరడంతో పాటు జిల్లా సస్యశ్యామలం కానున్నదన్నారు. అన్నదాతలకు రాష్ట్ర సర్కార్ వెన్నుదన్నుగా నిలుస్తున్నదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడుతలో రూ.25వేలలోపు, రెండో విడుతలో రూ.50వేలలోపు, తాజాగా రూ.లక్షలోపు పంట రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసిందన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు, మత్స్యకారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు తదితర లబ్ధిదారులకు రూ.279.76 కోట్ల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. 13 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును వివరించారు.
రంగారెడ్డి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరిస్తూ.. వారి ఆశయ సాధనకు పాటుపడుతూ.. పేద ల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మం గళవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సంక్షేమ పథకా లు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందే దిశగా ముందుకెళ్తున్నదన్నారు.
రైతన్నకు వెన్నుదన్నుగా..
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచిందని మంత్రి సబితారెడ్డి తెలిపారు. 24 గంటల విద్యుత్తుతోపాటు ఎరువులు, విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచుతున్నదన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 619 మంది రైతులకు రూ.95లక్షల పరిహారాన్ని అం దించి ఆదుకున్నదన్నారు. గతేడాది వానకాలం, యాసంగి సీజన్లలో జిల్లాలో 3,04,617 మంది రైతులకు రూ.680 కోట్లు, 2023-24 వానకాలం సీజన్కు 3,01,484 మంది రైతులకు రూ. 248 కోట్లను నేరుగా వారి ఖా తాల్లో రైతుబంధు నిధులను జమ చేసిందన్నారు. 20 22-23లో 794 రైతు కుటుంబాలకు రూ. 39.70 కోట్ల ను రైతుబీమా కింద అందించి ఆదుకున్నదన్నారు. రుణమాఫీలో భాగంగా మొదటి విడుతలో 25వేలలోపు ఉ న్న 10,940 మంది రైతులకు రూ. 16.73 కోట్లను, రెం డో విడుతలో 50 వేల లోపు ఉన్న 24,0,13 మంది రైతులకు రూ.82.49 కోట్లను మాఫీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 9,579 మంది రైతులకు రూ. 31. 14 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినట్లు వివరించారు.
‘ధరణి’తో నూతన శకం..
దేశంలో ఎక్కడాలేని విధంగా ప్ర భుత్వం భూసంబంధిత లావాదేవీలను అత్యంత పారదర్శకంగా, సులభతరంగా నిమిషాల వ్యవధిలో జరిగేలా ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చినట్లు మం త్రి పేర్కొన్నారు. జిల్లాలో 1,92, 827 భూసంబంధిత దరఖాస్తులు రాగా..1,64,718 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, మిగిలినవి త్వరలోనే పరిష్కారం అవుతా యన్నారు. ఇండ్ల నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం జీవో. 58 కింద 19, 661 దరఖాస్తులు రాగా 4,552 దరఖాస్తులను పరిశీలించి ఇప్పటివరకు 2,681 మంది లబ్ధ్దిదారులకు పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. జీవో 59 కింద 13,231 దరఖాస్తులు రాగా..3,871 దరఖాస్తులను పరిశీలించి ఇప్పటివరకు 3,751 మందికి పట్టాలిచ్చామన్నారు. ఎల్బీనగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలో జీవో118 ద్వారా 30 కాలనీ వాసులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
పేదింట కల్యాణ కాంతులు..
జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం ద్వారా 2022-23లో 7, 469 మంది ఆడపిల్లలకు రూ.74.77 కోట్లు, షాదీముబారక్ ద్వారా 3,467 మంది ఆడపిల్లలకు రూ. 34.71 కోట్లను పెండ్లి ఖర్చుల కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి వివరించారు. ఈ ఏడాదిలో కల్యాణలక్ష్మి పథకం కింద 1,913 మందికి రూ.19.15 కోట్లు, షాదీముబారక్ కింద 1,494 మందికి రూ. 14.96 కోట్లు అందజేసిందన్నారు.
నెరవేరుతున్న సొంతింటి కల ..
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు 6,645 ఇండ్లను మంజూ రు చేయగా.. ఇప్పటివరకు రూ.120.45 కో ట్లతో 2,293 ఇండ్ల నిర్మాణం పూర్తై.. మౌలిక వసతుల పనులు జరుగుతున్నట్లు వివరించారు. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కింద ప్ర భుత్వం లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ. 3 లక్షల చొప్పు న ఇంటి నిర్మాణానికి అందిస్తున్నదన్నారు. ప్రతి నియోజకవర్గానికీ మూడు వేల చొప్పున జిల్లాలో 22,150 మందికి ఈ పథకంలో లబ్ధి చేకూరనున్నదన్నారు.
పరిశ్రమలతో విరివిగా ఉపాధి అవకాశాలు..
జిల్లాలో విస్తారంగా ఏర్పాటవుతున్న పరిశ్రమలతో స్థానికంగా విరివిగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రఖ్యాత బహుళజాతి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆమెజాన్, టాటా, బోయింగ్, విప్రో, పీఅండ్జీ, రేడియంట్, ఆశీర్వాద్, పోకర్ణ తదితర కంపెనీలు ఏర్పాటు కావడంతో వేలాదిమందికి ఉపాధి లభిస్తున్నదన్నారు. టీఎస్-బీపాస్ ద్వారా 1,7 47 పరిశ్రమలకు రూ.78,798 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో అనుమతులు లభించగా 1,358 పరిశ్రమలు రూ.62,952 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలను స్థాపించి 7.25 లక్షల మందికి ఉపాధి కల్పించాయన్నారు. జిల్లా లో 19,333 ఎకరాల్లో రూ.63 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీతో లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తుందన్నారు.
రూ.279.76కోట్ల చెక్కుల పంపిణీ
డీఆర్డీవో ఆధ్వర్యంలో 3,690 స్వయం సహాయక సం ఘాల మహిళలకు ఇచ్చే రూ.273.60కోట్ల బ్యాంకు లిం కేజీ రుణాలకు సంబంధించిన చెక్కును మంత్రి సబితాఇంద్రారెడ్డి అందజేశారు. మెప్మా ఆధ్వర్యంలో 20 ఎస్ హెచ్జీలకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రూ.2 కోట్ల విలువ జేసే చెక్కునూ మహిళలకు అందజేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మంజూరైన టూవీలర్, త్రీవీలర్ వాహనాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను 42 మంది లబ్ధ్దిదారులకు ఇచ్చారు. టీప్రైడ్ పథకం కింద 68 మంది ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.1.98కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఎకనామిక ల్ రీహాబిటేషన్ స్కీం కింద 37 మందికి రూ.18.50 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు. కులాంతర వివా హం చేసుకున్న మూడు జంటలకు అవార్డు కింద రూ.7.50 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. 13 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కు క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలను అందజేశారు. సంబురాల్లో భాగంగా ఆమనగల్లు కేజీబీవీ, మోడల్ స్కూల్, శంకర్పల్లి త్రివేణి స్కూల్, చంపాపేట, సరూర్నగర్ ఈడీయూ-స్మార్ట్ స్కూల్, హయత్నగర్ పాఠశాలల విద్యార్థులు దేశభక్తిని చాటేలా ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వయసు రీత్యా స్వాతంత్య్ర సమరయోధుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారివారి ఇండ్లకే వెళ్లి సన్మానించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ సంబురాల్లో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్ట ర్లు ప్రతిమాసింగ్, భూపాల్రెడ్డి, ట్రైనీ కలెక్టర్ కదివరన్ ఫళని, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, డీఆర్వో సంగీత, కలెక్టరేట్ ఏవో ప్రమీలా రాణి, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అతివలకు అండగా..
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను అం దిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2022-23లో 12,061 స్వయం సహాయక సంఘాలకు రూ.800.11 కోట్ల బ్యాంకు రుణాలను అందించామన్నారు. 2023-24లో 12,989 సంఘాలకు రూ. 710 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు రూ. 2,609 సంఘాలకు రూ.202 కోట్లను పంపిణీ చేశామన్నారు. స్త్రీ నిధి ద్వారా 2022-23లో రూ.73.48కోట్లు, 20 23-24లో రూ.8.73కోట్లు ఇప్పటివరకు అందిం చా మన్నారు. వ్యాపారం చేసుకునేందుకు గతేడాది 5,637 మంది మహిళలకు రూ.88.88 కోట్లు పంపిణీ చేశా మని..ఈ ఏడాది లక్ష్యం మేరకు రుణాలను అంది స్తామన్నారు.
పాలమూరుతో సస్యశ్యామలం..
జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మిషన్ భగీరథ పథకంలో రూ.476 కోట్లను వెచ్చించి 1072 ఆవాసాలకు సురక్షిత నీటిని అందించామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ‘మిషన్ కాకతీయ’ లో నాలుగు విడుతల్లో రూ.133 కోట్లతో 862 చెరువులను బాగు చేసుకున్నామన్నారు. దీనివల్ల సాగు నీటి సమస్య పరిష్కారమైందన్నారు. రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడంతో రానున్న రోజుల్లో శాశ్వతంగా సాగు, తాగు నీటి సమస్య తీరి జిల్లా సస్యశ్యామలం కానున్నదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.