షాద్నగర్, డిసెంబర్ 23: ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని విద్యాభివృద్ధికి కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం షాద్నగర్, కొత్తూరు, చౌదరిగూడ మండలాల్లో ఆమె పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల బలోపేతానికే ‘మన ఊరు-మనబడి’ని అమలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యార్థులు, ఉద్యోగార్థుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున గ్రంథాలయాలు ఏర్పాటుచేయడంతోపాటు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని తమ వంతుగా అభివృద్ధి చేసేందుకు ఆర్థికంగా ఎదిగిన వ్యాపారులు, విద్యావంతులు ముందుకు రావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చౌదరిగూడ మండలం జిల్లేడు గ్రామంలో ఎన్ఆర్ఐ దాత పొట్టి శ్రీనివాస్ తన తండ్రి పొట్టి సత్తయ్య జ్ఞాపకార్థం సొం త ఖర్చులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడా రు. ప్రభుత్వ విద్యపై ఉన్న నమ్మకంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించాలనే సంకల్పంతో తమ వంతుగా సహా యం చేసేందుకు పొట్టి శ్రీనివాస్ ముందుకు రావడం అభినందనీయని కొనియాడారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో సర్కారు బడులను మరింత బలోపేతం చేసేందుకు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢసంకల్పంతో సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’కి శ్రీకా రం చుట్టారని, విడుతల వారీగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు బలోపేతం అవుతాయన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించామన్నారు. కేజీ టూ పీజీ ఉచిత వి ద్యలో భాగంగా ఇప్పటికే పాఠశాల స్థాయి నుం చి డిగ్రీ ఉన్నత విద్య వరకు గురుకులాలను ఏర్పాటు చేసి ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా మె రుగైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. రాను న్న రోజుల్లో మరిన్ని గురుకుల విద్యాసంస్థలు అందుబాటులోకి వస్తాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రతి మండలానికీ గురుకుల పాఠశాల అందుబాటులోకి వచ్చింద ని, ప్రతిఏటా ఒక్కో విద్యార్థికి సగటున రూ. 1.20లక్షల మేర ఖర్చు చేసి నాణ్యమైన విద్యను
ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కూడా ఉపకార వేతనాల ను అందించి ప్రోత్సహిస్తున్నదన్నారు. సర్కారు బడుల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ బంగారు స్వరూప, మున్సిపల్ చైర్మన్ నరేందర్, గ్రామ సర్పంచ్ బా బురావు, ఆర్డీవో రాజేశ్వరి, బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
షాద్నగర్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో శుక్రవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పలువురు లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదలకు అండగా నిలవాలని, ప్రతి ఆడబిడ్డ సంతోషంగా వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో రూ. 72 కోట్లకు పైగా నిధులు ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందినట్లు తెలిపారు. తాజాగా మహిళలకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మనమందరం కలిసి సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని, అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
మంత్రి సబితారెడ్డిని కలిసిన ఉపాధ్యాయులు
కడ్తాల్, డిసెంబర్ 23: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని శుక్రవారం కడ్తాల్ మండలానికి చెందిన ఉపాధ్యాయులు హైదరాబాద్లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 30న మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, విద్యావనరుల కేంద్రంలో నిర్వహించనున్న మండల స్థాయి బోధనోపకరణ ప్రదర్శన మేళాకు రావాలని ఆహ్వానించినట్లు పాఠశాల హెచ్ఎం జంగయ్య, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో పద్మ, మల్లయ్య, సుమ, రంజిత, శ్రీనివాసాచారి, రాజేశ్, లక్ష్మణ్, రవీందర్రెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు.