తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోంది.. సీఎం కేసీఆర్తో అన్నదాతల కరెంట్ గోస తీరింది.. రాష్ట్రంలో సంక్షేమ పాలన, పథకాలు, అభివృద్ధిని చూసి దేశం యావత్తు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం చింతకాని మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలను గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు. మధిర బీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
– చింతకాని, సెప్టెంబర్ 16
చింతకాని, సెప్టెంబర్ 16 : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం చింతకాని మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పాతర్లపాడు, నేరడ, కొదుమూరు గ్రామాల్లో ఒక్కొక్కటి రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానలను కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొదుమూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా అందిద్దామని అన్నారు. సీఎం కేసీఆర్ పార్టీలో ఇంతవరకూ ఎవరికీ అన్యాయం చేయలేదని, పేరు తెచ్చిపెట్టిన పార్టీని మోసంచేసి ఇతర పార్టీల్లోకి వెళ్లడం బాధాకరమన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమపాళ్ళలో ఖమ్మంజిల్లాకు అందించారని, సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, రానున్న ఎన్నికల్లో మధిరలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేద్దామన్నారు.
ఖమ్మంజిల్లా ప్రజలు సీఎం కేసీఆర్ వెంట ఉన్నారని, ముచ్చటగా మూడోసారి చేయడంలో కీలకపాత్ర వహించనున్నారని తెలిపారు. మధిర నియోజకవర్గంలో అందుబాటులో ఉండే కమల్రాజును ఎమ్మెల్యేగా గెలిపిస్తే సామాన్యుల సమస్యలు ప్రజల దృష్టికి చేరుతాయని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు ఆత్మైస్ధెర్యంతో లక్ష్యంవైపుగా అడుగులు వేయాలని కోరారు. యావత్ దేశం సీఎం కేసీఆర్ పరిపాలనను కోరుకుంటున్నదని, దళితబంధుతో మరో సామాజిక విప్లవం రానున్నదని, తెలంగాణలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని, సీఎం కేసీఆర్తో రైతులకు కరెంట్ గోస తీరిందని, రైతులు పట్టపగలే వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. చింతకాని మండలాన్ని దళితబంధు పైలెట్ ప్రాజెక్టు కింద నూరుశాతం గ్రౌండింగ్ పనులు పూర్తిచేయడంతో దళితులు సంతోషంగా ఉన్నారన్నారు. మండలంలో సుమారు 3,700 మందికి లబ్ధి జరుగనున్నదన్నారు. 57 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు గోస పడ్డది మనందరికీ తెలుసని, పింఛన్ను 200 నుంచి 2 వేలకు చేర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశంలో నంబర్వన్గా నిలపడంలో సీఎం కేసీఆర్ పాత్ర అమోఘమని తెలిపారు. సభలో జిల్లా వైద్యాధికారి మాలతి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ మండల నాయకులు, ముఖ్యకార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.