కొత్తూరు, ఫిబ్రవరి 11 : పెంజర్ల అనంతపద్మనాభస్వామి ఆలయానికి త్వరలో బస్సు సౌకర్యం కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్రలో భాగంగా కొత్తూరు, నందిగామ మండలాల్లో ఆదివారం జరిగిన సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహిళలకు ఫ్రీ బస్సు కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారితే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. ప్రస్తుతం సమ్మక్క-సారక్క జాతర నడుస్తున్నందున గ్రామాల్లో బస్సులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. జాతర పూర్తి కాగానే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యాంసుంరద్రెడ్డి, నందిగామ ఎంపీపీ ప్రియాంక, మాజీ సర్పంచ్ సుదర్శన్గౌడ్, కాంగ్రెస్ కొత్తూరు మండలాధ్యక్షుడు హరినాథ్రెడ్డి పాల్గొన్నారు.