రంగారెడ్డి, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డిలు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని అభిలాషించారు.
ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ విజయ దశమి అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో విజయదశమి స్ఫూర్తిని రానున్న రోజుల్లోనూ కొనసాగిస్తామన్నారు. జిల్లాకు చెందిన రైతులు, యువత, వ్యాపారులు, మహిళలు ఇతర అన్నివర్గాల వారు బాగుండాలని
మంత్రులు కోరుకున్నారు.