రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో పడి సందీప్ రాజ్ (25) అనే యువకుడు మృతి చెందాడు. నాగోల్లోని మెట్రో స్టేషన్లో పనిచేస్తున్న సందీప్, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్న పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.