షాబాద్, జనవరి 6: ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని ఎంఈవో శంకర్రాథోడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వెల్స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ఫెయిర్ నిర్వహించారు.
అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన నమునాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వరి, వెల్స్పన్ ఫౌండేషన్ జీఎం సురేఖ, ప్రాజెక్ట్ మేనేజర్ భద్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.