తుర్కయాంజాల్, అక్టోబర్ 27 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని వింటేజ్ హోమ్స్ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో వివిధ కాలనీకి చెందిన అసోసియేషన్ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని రూ.2931 కోట్లతో అభివృద్ధి చేయడంతో పాటుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అంతర్జాతీయ పరిశ్రమలను ఏర్పాటు చేశానని తెలిపారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో రూ.96 కోట్లతో మిషన్ భగరథ పనులను చేపట్టి ప్రతి ఇంటికీ కృష్ణానీటిని అందించి ప్రజల నీటి కష్టాలను తొలగించామన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధం అవుతున్నారని, వారిని నమ్మి మోసపోవద్దని అన్నారు.
కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, కౌన్సిలర్ కీర్తన, రాగన్నగూడ మాజీ సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి, తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, మాజీ డైరెక్టర్ మేతరి అశోక్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ డైరెక్టర్ ఏనుగు ఆనంద్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు ఆర్ల కృష్ణ, సుదర్శన్రెడ్డి, నాయకులు విజయానంద్రెడ్డి, రాజీరెడ్డి, వెంకట్రెడ్డి, మేతరి శంకర్, ప్రేమ్కుమార్, శేఖర్గౌడ్, వివిధ కాలనీల సంక్షేమ సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 27 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ…. మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే రూ. 400లకే వంటగ్యాస్, రైతుబంధు, ఆసరా పింఛన్ల పెంపు, మహిళలకు నెలకు రూ.3వేలు అందజేయంతో పాటు పేదప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందించేందుకు కృషిచేయనున్నట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, ప్రధాన రహదారులు, సెంట్రల్లైటింగ్తో పాటు గ్రామాలను అన్ని రంగాలుగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్రెడ్డికి దండుమైలారం ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట ఎంపీపీ కృపేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటమరణారెడ్డి, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, డైరెక్టర్ వెంకటేశ్, సర్పంచ్ మల్లీశ్వరి జంగయ్య, పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.