గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై వికారాబాద్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెల్లోని పేదలు అనారోగ్య సమస్యలపై కనీస అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీన్ని అధిగమించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. 20 గ్రామాలకు ఒక పీహెచ్సీతోపాటు ఐదారు గ్రామాలకు ఒక సబ్ సెంటర్ను ఏర్పాటు చేసినా ప్రజలు సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదు.
దీన్ని దృష్టిలో ఉంచుకున్న అధికారులు పేద కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులతో ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఆరోగ్య సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి ఐదు కుటుంబాల చొప్పున దత్తత తీసుకొని పూర్తి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేయనున్నారు. సాధారణ రోగాలుంటే తగిన సలహాలు ఇవ్వడంతోపాటు తీవ్రమైన సమస్యలుంటే వైద్యులకు సమాచారం చేరవేసి తగిన చికిత్స అందేలా చూస్తారు. ఈ నెలాఖరు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది.
-వికారాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యంపై జిల్లా యం త్రాంగం దృష్టి పెట్టింది. చిన్న, చిన్న అనారోగ్య సమస్యలపై వారికి అవగాహన లేక ప్రాణాలపైకి తెచ్చుకుంటున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. అయితే ప్రస్తుతం జిల్లాలో 20 గ్రామాలకు ఒక పీహెచ్సీతోపాటు 5-6 గ్రామాలకొక సబ్సెంటర్ను ఏర్పాటు చేసి, అవసరమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినా ఇంకా సద్వినియోగం చేసుకోని వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది.
అయితే అనారోగ్య సమస్యలకు సంబంధించిన మూలాలను ముందే తెలుసుకుని గ్రామీణులకు అవసరమైన వైద్యాన్ని అందించడంతోపాటు వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం పేద కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. అయితే ఇటీవల జిల్లాలో ప్రారంభమైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో చేరిన విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడితే.. విద్యార్థులకు వారి కోర్సు పూర్తయ్యే నాటికి వైద్యులుగా క్షేత్రస్థాయి అనుభవం రావడంతోపాటు గ్రామీణ ప్రాంతా ల్లో వైద్యారోగ్య ప్రాధాన్యత ఎంత మేర అవసరమనే దానిపైనా వారికి అవగాహన రానున్నది.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఒక్కొక్కరు ఐదు కుటుంబాల చొప్పున దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెలాఖరు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. వికారాబాద్ మండలంలోని రామయ్యగూడ పీహెచ్సీ పరిధిలో ఉన్న కుటుంబాలను మెడికల్ కాలేజీ విద్యార్థులు దత్తత తీసు కోనున్నారు. ఇప్పటికే రామయ్యగూడ పీహెచ్సీ పరిధిలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది సర్వే నిర్వహించగా 500 కుటుంబాలున్నట్లు గుర్తించారు.
అయితే వారు నిరాక్ష్యరాస్యతతో చిన్న, చిన్న సమస్యంటూ పట్టించుకోకుండా ప్రాణాపాయస్థితికి తెచ్చుకుంటున్నారు. వైద్యవిద్యార్థులు ముందు గా దత్తత తీసుకున్న కుటుంబాలను కలిసి సంబంధిత కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారు..?, ఒక్కొక్కరి వయస్సు ఎంత..?, బీపీ, షుగర్ ఇతర వ్యాధులేమైనా ఉన్నా యా అనే వివరాలను సేకరించి ప్రత్యేకంగా హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయనున్నారు. దత్తత తీసుకున్న కుటుంబాల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే సలహా లు, సూచనలివ్వడంతోపాటు సంబంధిత వ్యాధులకు వైద్యం కోసం హెల్త్ ఎడ్యుకేటర్స్ దగ్గరకు పంపించనున్నారు.
ఈ విధంగా ప్రతినెలాలో ఒకసారి దత్తత కుటుంబాల వద్దకు మెడికోలు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వైద్యులకు సమాచారం ఇవ్వనున్నారు. ప్రధానంగా మహిళలకు సంబంధించి ప్రెగ్నెన్సీ, రక్తహీనత, నెలవారీ టీకాలు, తల్లిపాల ప్రాముఖ్యత, పిడియాట్రిక్ తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య విద్యార్థులు అవగాహన కల్పించడంతోపాటు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
గ్రామీణ ప్రాంతాల పేదలకు ఆరోగ్య సూచనలు అందించాలని నిర్ణయించడం జరిగింది. ఇందుకోసం ప్రభుత్వ మెడికల్ విద్యార్థులు రామయ్యగూడ పీహెచ్సీ పరిధిలోని రామయ్యగూడలో ఉన్న ఐదు వందల పేద కుటుంబాలను 100 మంది వైద్య విద్యార్థులు ఒక్కొక్కరు ఐదు కుటుంబాల చొప్పున దత్తత తీసుకోనున్నారు. దత్తత తీసుకున్న కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై విద్యార్థులు ఇచ్చే సమాచారం మేరకు వైద్యులు తగు వైద్య సదుపాయాన్ని అందిస్తారు.
– పల్వన్కుమార్, వికారాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి