శామీర్పేట, ఆగస్టు : అంబులెన్స్లో ఓ గర్భిణీకి 108సిబ్బంది పురుడు పోశారు. శామీర్పేట మండలం పొన్నాల గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(24)కు 7 నెలలు మాత్రమే నిండాయి. సోమవారం రాత్రి ఉదయం 10:30 గంటలకు నొప్పులు రావడంతో 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.
అంబులెన్స్ ఫైలట్ వేణు, ఈఎంటీ యాదమ్మ సంఘటన స్థలానికి చేరుకుని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ సమయంలో మార్గంమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్లోనే ఆ మహిళకు 108సిబ్బంది పురుడు పోశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినట్లు 108సిబ్బంది తెలిపారు. అనంతరం తల్లీ, బిడ్డలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.