కుత్బుల్లాపూర్,డిసెంబర్5 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని కాలనీల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించి, అభివృద్ధి పర్చేలా తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం జీడిమెట్ల డివిజన్ వుడ్స్ ఓనర్స్ వేల్పేర్ అసోషియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలోని పలు మౌలిక వసతులపై వినతిపత్రాన్ని అందజేశారు.
కాలనీలో భూగర్భ డ్రైనేజీ, వాటర్ పైపులైన్, పంచతత్వపార్క్ వంటి వాటిని అభివృద్ది చేసి కాలనీవాసులకు మరిన్ని సదుపాయాలను కల్పించాలని కోరారు. కాలనీవాసుల సమస్యలపై త్వరితగతిన పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.
కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శివరామకృష్ణ, శ్రీహరి, ఉదయ్కుమార్, రవీందర్రెడ్డి, కమల్ కిషోర్, స్వామి, పి.కృష్ణ, కే.కృష్ణ, శ్రీహరి, ఉదయ్కుమార్, రవీందర్రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, పల్లా నాగరాజు, జగన్రెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.