గౌతంనగర్,నవంబర్28 : మహాత్మ జ్యోతిరావుపూలే చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం గౌతంనగర్ చౌరస్తాలో కార్పొరేటర్ మేకల సునీత ఆధ్వర్యంలో పూలే వర్ధంతి వేడుకలను నిర్వహించారు.
ఎమ్మెల్యే మైనంపల్లి, కార్పొరేటర్లు మేకల సునీత, ప్రేమ్కుమార్, జితేంద్రనాథ్ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లుర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. మహాత్మ పూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరం ముందుకు పోవాలని అన్నారు. దేశానికి ఆయన చేసే ఎంతో గొప్పదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు విద్యనందించేందుకు అతడు ఎంతో కృషి చేశాడన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్.జగదీశ్గౌడ్, మేకల రాముయాదవ్, మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, మల్కాజిగిరి నియోజకవర్గం అధికార ప్రతినిధి జీఎన్వీ.సతీశ్కుమార్, రాందాస్ సంతోష్, మోహన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.