కోట్పల్లి, జూలై 23 : పార్టీ బలోపేతానికి టీఆర్ఎస్ కార్యకర్తలే పట్టుగొమ్మలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శనివారం మండలంలోని నాగసాన్పల్లి తండాకు చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ మండల అధ్యక్షుడు అనిల్ అధ్యక్షతన వికారాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఆనంద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పని చేస్తుందని, అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సత్యం, ఎంపీటీసీ బందెయ్య, నాయకులు భరత్, మల్లారెడ్డి, నాగార్జునరెడ్డి, బీమ్లానాయక్ పాల్గొన్నారు.
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలి
ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ రక్తదానం మహాదానమన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, కౌన్సిలర్లు అనంత్రెడ్డి ఉన్నారు.