గాజులరామారం, మార్చి 27 : ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు. ఆదివారం గాజులరామారం డివిజన్ పరిధిలోని మెట్టుగాని గూడ కోటగుట్ట పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందన్నారు.
పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలలో పాల్గొన్నడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అంజయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్, లక్ష్మణ్, యాదయ్య, బాలచిత్రారి, నగేష్, కృష్ణ, అశోక్కుమార్, సీనియర్ నాయకులు రషీద్బేగ్, కమలాకర్, నవాబ్, మురళీ, చందు ముదిరాజ్, ఇబ్రహీం, చెట్ల వెంకటేష్, ఇమ్రాన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.