కీసర,జూలై 3: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. కీసర మండల పరిధిలోని పలు గ్రామాల్లో కలెక్టర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. అలాగే భోగారంలో పర్యటించి అభివృద్ధి పనులపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.పలు రకాల సమస్యలున్నాయని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎంపీడీవో పద్మావతికి సూచించారు. కార్యక్రమంలో డీపీఓ రమణమూర్తి, డీఆర్డీఓ పద్మజరాణి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాసమూర్తి, ఎంపీడీఓ పద్మావతి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.