రామంతాపూర్, జూలై 3 : హబ్సిగూడ డివిజన్ రామంతాపూర్ పెద్ద చెరువును ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆదివారం సందర్శించారు. వర్షాకాలంలో చెరువు చుట్టు పక్కల ప్రాంతాల్లో వరదనీరు చేరకుండా ముందస్తు చర్యలలో భాగంగా నీరు బయటకు పంపేందుకు మోటర్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరదనీరును ఎప్పటికప్పడు బయటకు పంపేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ చేతన, ఈఈ నాగేందర్,డీఈ నాగమణి, ఏఈ కీర్తి, ఇరిగేషన్ డీఈ పవన్, ఏఈ పృథ్వీ, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ బివి. చారి, సోమిరెడ్డి, భాస్కర్రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, శివ, జేసీబీ రాజు, సూరం శంకర్, సంతు, కాలనీ వాసులు పాల్గొన్నారు.