ఘట్కేసర్ రూరల్, మే 23 : నిషేధిత గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి చేసి రూ.5 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మేడ్జల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్ చంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఘట్కేసర్ మండల కేంద్రంలోని అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో బీదర్ నుంచి వరంగల్కు నిషేధిత గుట్కాను తరలిస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో అనుమాన స్పద స్థితిలో వెళ్తున్న కారును పోలీసులు అడ్డుకుని తనిఖీలు నిర్వహిస్తుండగా.. డ్రైవర్ కారు వదిలి పారిపోగా మరో వ్యక్తి మారుతిని అదుపులోకి తీసుకున్నారు.
కారులో తనిఖీ చేయగా 30 బ్యాగుల నిషేధి గుట్కా ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్కు చెందిన గోపాల్ ఆదేశాల మేరకు డ్రైవర్ రాజశేఖర్, మారుతీలు బీదర్లో కొనుగోలు చేసి వరంగల్ తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితులు గోపాల్, రాజశేఖర్ పరారీలో ఉన్నారని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.