మల్కాజిగిరి : మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామివారి 350 వ ఆరాధనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వెంకటేశ్వరనగర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 26 వరకు జరుగనున్నాయి. సోమవారం స్వామివారి అష్టోత్తర పారాయణం, కనకమహాపూజ, ప్రత్యేక ఫల పంచామృతఅభిషేకం, పండితులచే రాఘవేంద్ర స్వామివారి ప్రవచనాలు, అలంకార బ్రాహ్మణ సేవ మహామంగళహారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.