హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పరుశురామ్ ఇటీవలే అనారోగ్యంతోచనిపోయారు. 2000 బ్యాచ్ తోటి కానిస్టేబుళ్లు కలిసి రెండు లక్షల రూపాయలను గురువారం రాచకొండ సీపీ మహేష్ భగవత్ సమక్షంలో పరశురాం భార్యకు అందజేశారు.ఈ సందర్భంగా తోటి ఉద్యోగికి ఆర్థిక సహాయం చేసిన బ్యాచ్మేట్స్ ను సీపీ అభినందించారు.
వీరికి మిగతా బెనిఫిట్స్ త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్లు శ్రీధర్, దుర్గా ప్రసాద్, నరసింహ, శశికిరణ్ రమా కాంత్ రెడ్డి, కృష్ణ, శంకర్, దేవేందర్, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు భద్రా రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.