పీర్జాదిగూడ, ఆగస్టు : తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత, స్వరాష్ట్ర సాధన కోసం తపించిన తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈ రోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి , కమీషనర్ ఎం.శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ , కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు.