మూసాపేట : చదువు మధ్యలో ఆపేసి, రెగ్యులర్గా పాఠశాలకు వెళ్లలేని వారికోసం సార్వత్రిక విద్యా విధానం ద్వారా చదువుకునే అవకాశాన్ని తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ కల్పిస్తున్నది. కో-ఆర్డినేటర్ సయ్యద్ బుర్హాన్ అందుకు సమందించిన వివరాలు వెల్లడించారు. పదో తరగతి చదువుకునే వారు టీసీ, బర్త్, క్యాస్ట్ , ఆధార్ సర్టిఫికెట్లు, పాస్ పోర్టు సైజ్ ఫోటో, ఇంటర్ చదువుకునేవారు పదోతరగతి మార్కుల పట్టిక, కులం, ఆధార్ సర్టిఫికెట్లు, పాస్ పోర్టు సైజ్ ఫోటోలతో మూసాపేటలోని ప్రభుత్వ పాఠశాలలోని స్టడి సెంటర్(210601)లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
సెప్టెంబర్ 10 వరకూ ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ప్రవేశం పొందవచ్చు. అదేవిధంగా సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 23వరకు అపరాధ రుసుముతో ప్రవేశం తీసుకోవచ్చు. అడ్మిషన్ ఫీ ఆన్లైన్లో చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లకు ప్రభుత్వం గుర్తింపు ఉంటుందని, ఉన్నత చదువులు, పదోన్నతులు, ఉద్యోగాలకు కూడా అర్హత ఉంటుందని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 89191 21509 నెంబర్ను సంప్రదించవచ్చు.