దుండిగల్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ, వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శంభీపూర్రాజు సూచన మేరకు పేట్బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో శనివారం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం సమావేశమైంది.
మేయర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సహాకారంతో పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గోపీ, డిప్యూటీ మేయర్ ధన్రాజు, బాచుపల్లి మండలం తాసీల్దార్ సరితతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిద విభాగాలకు చెందిన అధికారులు, కార్పొరేటర్లు, కో-అప్షన్ సభ్యులు పాల్గొన్నారు.