గౌతంనగర్, ఆగస్టు 6 : బోనాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మౌలాలి డివిజన్లోని భరత్నగర్ బస్తీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిసి ఆదివారం నిర్వహించే బోనాల పండుగకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అధ్యక్షుడు మంద భాస్కర్, చంద్రకాంత్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీహాల్ నిర్మాణం, పారిశుద్ధ్య సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మున్సిపల్ ఈఈ లక్ష్మణ్ను భరత్నగర్లో పర్యటించాలని ఎమ్మెల్యే సూచిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమతాలు, రాజకీయాలకు అతీతంగా బోనాలను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
నేరేడ్మెట్, ఆగస్టు 6: రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అన్ని వర్గాల ప్రజలు గౌరవంగా పండుగలను నిర్వహించుకోవాలని మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఉపేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం డిఫెన్స్కాలనీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయాల ప్రతినిధులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, చెన్నారెడ్డి, మహేశ్, మోహన్, శ్రావణ్, గంగాధర్, ఆర్తీ, పరిమళ, విజయలక్ష్మి, శోభ, రేణుక, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.