మేడ్చల్, జూలై 5: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం మేడ్చల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో కొనసాగుతున్నది. సోమవారం ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని పారిశుధ్య పనులతో పాటు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మేడ్చల్ మున్సిపాలిటీలో పలు వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమంలో చైర్పర్సన్ దీపికా నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొని పారిశుధ్య పనులు చేపట్టి, మొక్కలు నాటారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు.
ఘట్కేసర్, జూలై 5 : పట్టణ ప్రగతిలో భాగంగా ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్, పోచారం చైర్మన్ కొండల్రెడ్డి ఆధ్వర్యంలో పలు వార్డులలో పరిశుభ్రత పనులు, మొక్కలు నాటడం, మొక్కల పంపిణీ, రోడ్ల పక్కన చదును చేయడం, మురుగునీటి కాలువలను శుభ్రం చేయడం వంటి పనులను చేపట్టారు. పోచారం మున్సిపాలిటీ 12వ వార్డు సంస్కృతి టౌన్షిప్లో కౌన్సిలర్ బి.హరిప్రసాద్రావు ఆధ్వర్యంలో పార్కు స్థలంలో పూల మొక్కలు నాటారు.వైస్ చైర్మన్లు రెడ్యానాయక్, మాధవ రెడ్డి, కమిషనర్లు సురేశ్, వసంత, డీఈ శ్రీలత, ఏఈ నరేశ్ పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, జూలై 5: పర్యావరణ సమతుల్యతకు హరితహారం దోహదం చేస్తుందని, చెట్లు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తాయని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. నగరపాలక పరిధిలోని 3వ డివిజన్లో నిర్వహించిన హరితహారం, వార్డు కమిటీ సమావేశంలో మేయర్ పాల్గొని కార్పొరేటర్ శారద ఈశ్వర్రెడ్డి, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్, కమిషనర్ శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 13వ డివిజన్ కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి శ్రీధర్రెడ్డి, డివిజన్ పరిధి…పలు కాలనీల్లో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు. వాటర్ వర్క్స్ మేనేజర్ రమ్య, వర్క్ ఇన్స్పెక్టర్ విజయపాల్రెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, జూలై 5 : పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని 9,10వ వార్డులు, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 15, 16వ వార్డులలో నిర్వహించిన హరితహారం, పట్టణ ప్రగతిలో చైర్మన్లు పాల్గొని మొక్కలు నాటి ఇంటింటికీ పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్లు ఎ.వాణి రెడ్డి, స్వామి, ప్రత్యేక అధికారులు గణేష్, పూర్ణిమ, వైస్ చైర్మన్లు నరేందర్, మల్లేష్, ఫారెస్ట్ అధికారి లక్ష్మణ్, హెచ్ఎండబ్ల్యూఎస్ జీఎం సరిత, కౌన్సిలర్లు కె.అనిత, కె.దివ్య, నర్సింహా రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
శామీర్పేట, జూలై 5 : తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్లోని మహాలక్ష్మి కాలనీలో చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు 200 మొక్కలు నాటారు.మహాలక్ష్మి కాలనీలో రూ.13 లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కౌన్సిలర్ ఉమ శ్రీనివాస్, ప్రత్యేక అధికారి అశోక్, కమిషనర్ గంగాధర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ముదిరాజ్,నర్సింగ్రావు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు కార్పొరేటర్ ఏకే.మురుగేశ్ గుంతలు తవ్వించారు. అనంతరం వార్డులో పారిశుధ్యం, శ్రమదానం చేసి చెత్తను తొలగింప చేశారు. శ్రీరాంనగర్లో కార్పొరేటర్ సతీష్కుమార్ ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు ఆనంద్, డివిజన్ అధ్యక్షుడు యాదగిరి, బీసీ సెల్ అధ్యక్షుడు రాజు, యూత్ ఉపాధ్యక్షుడు బాబు పాల్గొన్నారు.
బోడుప్పల్, జూన్5: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనులతో పాటు హరితహారం మొక్కలు నాటారు. నగర పరిధిలోని ఆయా డివిజన్లలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్ సుడిగాలి పర్యటన చేశారు. కాలనీల్లో నెలకొన్న విద్యుత్, అంతర్గత రోడ్ల మరమ్మతు సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు.5వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఆధ్వర్యంలో కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి కాలనీవాసులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సత్యనారాయణ, పూర్ణిమ, సతీశ్కుమార్ పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పర్యటించి, సమస్యలు తెలుసుకున్నారు.పేట్బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, కమిషనర్ అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు జైపాల్ రెడ్డి, మల్లికార్జున్, బాలరాజు, వీణాసురేందర్ గౌడ్, శ్రీనివాస్, హేమంత్ రెడ్డి, మేనేజర్ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.