కాప్రా, ఆగస్టు 15 : పేదవర్గాల అభ్యున్నతికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన అవిరళ కృషి చిరస్మరణీయమని ఉప్పల్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు బేతి సుభాష్రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం కాప్రా డివిజన్ వలువర్నగర్లో మేరీమాత గుడి సమీపంలో భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యేలు.. స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజుతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో అల్వాల్ మున్సిపల్ మాజీ చైర్మన్ జీవకన్, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.