నేరేడ్మెట్, ఆగస్టు 9 : కృష్ణపట్నం ఆనందయ్యలాంటి వ్యక్తులను కాపాడుకోవడం మన అందరి అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్లోని బొడ్డు కమలమ్మ ఫంక్షన్హాల్లో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సీతారామరావు సహకారంతో ఎమ్మెల్యే , కృష్ణపట్నం ఆనందయ్య సంయుక్తంగా కలిసి ఉచితంగా ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హన్మంతరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిసారి కృష్ణపట్నం ఆనందయ్య ఇక్కడకు వచ్చి నియోజకవర్గ ప్రజలకు కొవిడ్ మందును పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. నియోజకవర్గంలో 10వేల మందికి ఉచిత ఆయుర్వేద మందును అందజేసేందుకు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కృషి చేసిందన్నారు. కృష్ణపట్నం ఆనందయ్య మందువల్ల ఎలాంటి సమస్యలు ఉండవని భరోసా ఇచ్చారు.
కృష్ణపట్నం ఆనందయ్య మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా సేవ చేయాలనే ఉద్దేశంతో తన తల్లి ద్వారా నేర్చుకున్న ఆయుర్వేద వైద్యంతోనే కరోనాకు మందు కనిపెట్టి ఎంతో మందికి ఉచితంగా అందజేస్తున్నామన్నారు. మొట్టమొదటిసారి మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద మందును ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మీనా , ప్రేంకుమార్, రాజ్ జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఉపేందర్రెడ్డి, రావుల అంజయ్య, పరశురాంరెడ్డి, జీవగన్, చిత్రగోకుల్, మోటె సాయికుమార్, జీఎన్వీ సతీష్కుమార్, గుండా నిరంజన్, ఎస్ఆర్ ప్రసాద్, మహేష్ యాదవ్, చెన్నారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, యాది, మహేష్, రాజు, టిక్కమ్ పాల్గొన్నారు.