మల్కాజిగిరి/నేరేడ్మెట్, ఆగస్టు 8: రాష్ట్రంలో ఉన్న ఆలయాలకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బోనాల జాతర సందర్భంగా ఆదివారం భరత్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతరకు హాజరయ్యారు. ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మంద భాస్కర్, చంద్రకాంత్, రాజు, సునందరావు, కృష్ణ, వెంకటేష్, లక్ష్మణ్, హన్మంతరావు, సంతోష్ పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ తరఫున ఎమ్మెల్యే మైనంపల్లిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, రామకృష్ణ, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
జేఎల్ఎస్నగర్లో హిల్టాప్ కాలనీలో బోనాల జాతర వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో పాటు కార్పొరేటర్ ప్రేంకుమార్, రాముయాదవ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.