మల్కాజిగిరి, ఆగస్టు 7 : బస్తీ దవాఖానల్లోనూ ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని ప్రజలందరూ ఈ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కోరారు. శనివారం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధిలోని బీజేఆర్నగర్ బస్తీ దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ను స్థానిక కార్పొరేటర్ వై.ప్రేమ్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, ప్రజలు అక్కడే వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్కిల్ టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి జీఎన్వీ సతీశ్కుమార్, నాయకులు నిరంజన్, బాబు, సత్యనారాయణ, సంపత్రావు, శంకర్రావు, నవీన్యాదవ్, భాక్షపతి, అశోక్, కిశోర్, సంతోష్, మోహన్రెడ్డి, ఉపేందర్ తది తరులు పాల్గొన్నారు.