దుండిగల్, ఆగస్టు 21 : నగర శివారు మున్సిపాలిటీల్లో మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. శనివారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని డి.పోచంపల్లి గ్రా మం నుంచి మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో రూ.27లక్షలతో చేపట్టే సీసీరోడ్డు నిర్మాణ పనులకు చైర్మన్ సుంకరి కృష్ణవేణికృష్ణతో కలిసి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి రోజురోజుకు విస్తరిస్తుందన్నారు.
కొత్తగా ఏర్పాటు అయిన మున్సిపాలిటీలను, మున్సిపల్ కార్పొరేషన్లను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు నిరం తరం కృషి చేస్తున్నారన్నారు. వారి సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్యాదవ్, పీఎసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, భరత్కుమార్, మహేందర్యాదవ్, సాయియాదవ్, శంకర్నాయక్, ఎల్లుగారి సత్యనారాయణ, గోపాల్రెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
భారత్ కీ ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో దుండిగల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీఎంజీఎస్వై ఫేస్-3 సెమినార్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజులు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్యోజన పథకం కింద చేపట్టబోయే బీటీరోడ్లు, లింక్రోడ్లపై చర్చించారు. వివిధ రూపాల్లో వచ్చే నిధుల ద్వారా చేపట్టబోయే పీఆర్రోడ్లు భవిష్యత్ తరాలకు అనుగుణంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
సింగిల్లైన్ రోడ్లను డబుల్ రోడ్లుగా చేపట్టేందుకు చర్యలు, ఆసుపత్రులకు, స్కూళ్లకు, వివిధ కార్యాలయాలకు అనుసంధానం చేస్తూ చేపట్టే కనెక్టింగ్ రోడ్లపై తక్షణం డిజిటలైజేషన్ చేసి.. పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ రామ్మోహన్రావు, డీఈ యాదగిరి, ఏఈ నాగేశ్వర్రావు, దుండిగల్ మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణికృష్ణ, కమిషనర్ భోగిశ్వర్లు, వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.