కుత్బుల్లాపూర్ జోన్ బృందం,జూలై 1: నియోజకవర్గంలో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. కుత్బుల్లాపూర్,గాజులరామారం జంటసర్కిళ్లతో పాటు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల్లో నిర్వహించిన హరితహారం,పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొన్నారు. డీసీలు మంగతాయారు,రవీంద్రకుమార్లతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. గాజులరామారం సర్కిల్, జగద్గిరిగుట్ట సంజయ్పురి కాలనీలో హరితహారం,పట్టణ ప్రగతి కార్యక్రమంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. నిజాంపేట బండారి లే అవుట్ కాలనీలో ని కార్యక్రమంలో మేయర్ కొలన్నీలాగోపాల్రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గాగిళ్లాపూర్లో చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణికృష్ణతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.