ఘట్కేసర్ రూరల్, మార్చి 7 : ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఆశా వర్కర్లు అందించిన సేవలు అభినందనీయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి…అవుషాపూర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైయస్ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో కరోనా వారియర్స్కు ఆదివారం నిర్వహించిన సన్మానం, చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి , ఫెస్టివ్ ఫోక్స్ కల్చరల్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్పర్సన్ ఉమా ఎడ్లపాటి, ప్రధాన కార్యదర్శి ధాత్రి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్, డీఆర్డీఓ జ్యోతి, జాగృతి జిల్లా అధ్యక్షురాలు అనితారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… లాక్డౌన్ సమయంలో ఆశా వర్కర్లు చేసిన సేవలు అభినందనీయమని తెలిపారు. వారి సేవలను గుర్తించిన ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పెద్ద మనసుతో వైయస్ రెడ్డి ట్రస్టు ద్వారా ఆశా వర్కర్లకు చీరలు అందజేసి సన్మానించడం అభినందనీయమన్నారు.
ఎంపీపీ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు నిత్యావసర సరుకులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ నారాయణరావు, సర్పంచులు ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి, జలజ, మంగమ్మ, గీత, డివిజనల్ ఆరోగ్య విద్యా భోధకుడు వేపూరి రవికుమార్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి. నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఏనుగు మచ్చేందర్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బాలు యాదవ్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, మండల ఆశా వర్కర్లు పాల్గొన్నారు.