మేడ్చల్, జూలై 7: మేడ్చల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నది. ఏడో రోజు మున్సిపాలిటీల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని పారిశుధ్యం, హరితహారం కార్యక్రమం నిర్వహించారు.
పట్టణ ప్రగతితో కాలనీలు పరిశుభ్రంగా మారుతున్నాయని మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి , వార్డు సమావేశాల్లో పాల్గొన్నారు.అనంతరం కౌన్సిలర్ సుహాసినితో కలిసి మొక్కలు నాటారు. వైస్ చైర్మన్ రమేశ్, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, నర్సింహా రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు
ఘట్కేసర్ : ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధి… 17వ వార్డులో చైర్పర్సన్ ఎం.పావనీజంగయ్య యాదవ్ , పోచారం మున్సిపాలిటీ 5వ వార్డులో చైర్మన్ కొండల్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. పోచారం 5వ వార్డులో పరిశుభ్రత, రోడ్లకు ఇరువైపులా చదును చేయడం, నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను గుర్తించి పరిష్కరించారు. ఘట్కేసర్ 17వ వార్డులో బీటీ రోడ్డు పనులు, నీటి సరఫరా పైపులైన్లు ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. వైస్ చైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ : ప్రకృతి వన సంపదను మనం కాపాడితే అవి భవిష్యత్ తరాలను కాపాడుతాయని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. నగరపాలక పరిధి… 15వ డివిజన్లో నిర్వహించిన హరితహారం, పట్టణ ప్రగతిలో మేయర్ పాల్గొని కార్పొరేటర్ మంజుల రవీందర్తో కలిసి మొక్కలు నాటారు. కమిషనర్ శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
బోడుప్పల్ : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా పలు కాలనీల్లో ఖాళీ స్థలాలు, రోడ్లపై పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బంది సహాయంతో తొలగించారు. 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేశ్ యాదవ్, వార్డు కమిటీ సభ్యులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్ : సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నట్లు గుండ్లపోచంపల్లి చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో బుధవారం మొక్కలు నాటారు. వైస్ చైర్మన్ ప్రభాకర్, ఏసీపీ రామలింగరాజు, సీఐ ప్రవీణ్ రెడ్డి, కమిషనర్ అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పిస్తామని మున్సిపాలిటీ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని 13, 14వ వార్డులలో, దమ్మాయిగూడ 1, 2వ వార్డులలో నిర్వహించిన హరితహారం, పట్టణ ప్రగతిలో చైర్మన్లు పాల్గొని మొక్కలు నాటి పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు , వైస్ చైర్మన్లు నరేందర్, మల్లేష్, కౌన్సిలర్లు బిజ్జ శ్రీనివాస్ గౌడ్, శ్రీహరి గౌడ్, నాను నాయక్, సుజాత శ్రీనివాస్ పాల్గొన్నారు.
శామీర్పేట : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు అన్నారు. మిద్దె సాగు చేస్తూ మొక్కలు నాటి హరితహారానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న 8వ వార్డుకు చెందిన నరహరిని కమిషనర్తో కలిసి సన్మానించారు. కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.