కంటోన్మెంట్, జూన్ 20: సేవ చేయాలనే దృక్పథం కలిగి ఉండడం ఎంతో అభినందనీయమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని మూడో వార్డుకు చెందిన యువ నేతలు అజయ్యాదవ్తో పాటు వారి స్నేహితుల ఆధ్వర్యంలో కార్ఖానా మహంకాళి ఆలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డితో పాటు ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. సుమారు 100 మంది పేదలకు సరుకులు అందజేశారు. మంత్రి మా ట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు అం డగా నిలువడం అభినందనీయమన్నారు. 12 రకాల సరుకులను 100 మందికి అం దించారని, ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. దినేశ్, శ్రావణ్, సికిందర్, దయా, రాఘవన్, టింకు పాల్గొన్నారు.