కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
పూడూరు, మేడ్చల్, శామీర్పేట, మూడుచింతల్పల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మూడుచింతల్పల్లిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
శామీర్పేట, ఏప్రిల్ 28 : కరోనా మహమ్మరి ప్రపంచాన్ని వణికిస్తున్న రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా మూడుచింతల్పల్లి, శామీర్పేట మండలల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించి, మూడుచింతల్పల్లి మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధరగా రూ. 1888లు క్విం టాల్కు (దొడ్డు రకం), రూ. 1868లు సన్నాలకు కేటాయించడం జరిగిందన్నారు. తెలంగాణలో రైతులు పం డించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, ఆ విషయం లో రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని భరోసా ఇచ్చారు.
ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం 20కోట్ల బ్యాంక్ గ్యారం టి ఇచ్చిందన్నారు. మేడ్చల్ జిల్లాలో 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్రెడ్డి, ఎంపీపీ హారికమురళీగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి మేరిరేఖ, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, డీసీవో శ్రీనివాసమూర్తి, డీఎం రాజేందర్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీశ్గౌడ్, రైతుబంధు కన్వీనర్ కంటం కృష్ణారెడ్డి, మద్దుల శ్రీనివాస్రెడ్డి, ఏవోలు రమేశ్, కృష్ణవేణి, ఏఈవోలు రవి, సొసైటీ మేనేజర్ నర్సింహులు, సర్పంచ్లు రవి, అనురాధ రవీందర్రెడ్డి, జ్యోతిబల్రాంగౌడ్, సింగం ఆంజనేయులు, ఉప సర్పంచ్ రమేశ్యాదవ్, మోహన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, గోపినాయక్, ఎంపీటీసీలు సాయిబాబు, రైతుబంధు కో ఆర్డీనేటర్లు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి దత్తత మండలంలో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బుధవారం పర్యటించారు. మండలంలోని జగ్గంగూడ, లక్ష్మాపూర్, మూడుచింతల్పల్లి, ఆద్రాస్పల్లి, పోతారం, ఉద్దెమర్రి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రూ.18లక్షల విలువ గల కల్యాణలక్ష్మి, షాదిముబారక్ 18 చెక్కులు పంపిణీ చేశారు.
మేడ్చల్/మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 28 : రైతు సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ ప్రభు త్వం కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని పూడూరు, మేడ్చల్ రైతు సహకార సంఘాల్లో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో అన్నదాతకు స్వర్ణయుగం ప్రారంభమైందన్నారు. రైతు బీమా, రైతు బంధు, 24గంటల కరెంట్తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతు అత్యధిక పంటలను పండిస్తూ రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చారని ఆయన అన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కోనాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా వందశాతం ధాన్యాన్ని కొనుగోలు చేసిన దాఖలాల్లేవన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వందశాతం ధాన్యాన్ని కొనుగో లు చేయడమే కాదు, ధాన్యం అమ్మిన 48గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని తెలిపారు. ఇందుకోసం సహకార సంఘాల చైర్మన్, డైరెక్టులు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ.1888, కామన్ గ్రేడ్ రకానికి రూ.1868 ప్రభుత్వం మద్ధతు ధరను ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డీసీఎంస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, సహకార సంఘాల చైర్మన్ సుధాకర్రెడ్డి, రణదీప్రెడ్డి, ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, సర్పంచ్ బాబు యాదవ్, ఎంపీటీసీ నీరు డి రఘు, నాయకులు జగన్రెడ్డి, మద్దుల శ్రీనివాస్రెడ్డి, మర్రి నర్సింహరెడ్డి, సర్పంచ్లు, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.