బోడుప్పల్, ఏప్రిల్ 26: చెరువులు, పార్కుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తునట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్ పరిధిలోని రా చెరువు సుందరీకరణ పనులకు స్థానిక మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చదనం వెల్లివిరిసేలా, సందర్శకులను ఆకట్టుకునే విధంగా రా చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.