మేడ్చల్ రూరల్, జూలై 28 : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 92 మందికి బుధవారం రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వివిధ రకాల పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ తదితర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన బండారి విజయలక్ష్మికి సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.లక్ష చెక్కును చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి బుధవారం బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ అమరేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్, జైపాల్రెడ్డి, వీణా, అమరం సరస్వతీ, హంసరాణి, బాలరాజు, పెంటయ్య, రజితావెంకటేశ్, శ్రీనివాస్, హేమంత్రెడ్డి, రవీందర్గౌడ్, నాయకులు సంజీవగౌడ్, సురేందర్ గౌడ్, సుధాకర్, రవీందర్గౌడ్, రాజు, కుమార్, శ్రీనివాస్, రమేశ్, మధు, శ్రీహరి, సత్తిరెడ్డి, జీత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జవహర్నగర్, జూలై 28 : పేదలు ఆరోగ్యంగా ఉండాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, వారి ఆరోగ్యం కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న గొప్ప మానవతావాది సీఎం కేసీఆర్ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ కార్పొరేటర్ ఏకే మురుగేష్ సమక్షంలో డివిజన్కు చెందిన లక్ష్మీప్రసన్నకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.1 లక్ష చెక్కును బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు మూల స్వామిగౌడ్, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సింగన్న బాలరాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సిద్ధులు యాదవ్, డివిజన్ పార్టీ మ హిళా అధ్యక్షురాలు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
కీసర, జూలై 28 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా ఉంటున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చీర్యాల్ గ్రామానికి చెందిన బి.మల్లేశ్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.1 లక్ష చెక్కును బుధవారం మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, చీర్యాల్ మాజీ ఉప సర్పంచ్ బి.రమేశ్, నాగారం కౌన్సిలర్ నాగేశ్తో పాటు పలువురు తదితరులు పాల్గొన్నారు.