కంటోన్మెంట్, ఏప్రిల్ 23: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా నుంచి కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని బోయిన్పల్లిలోని ఏడు గుళ్ల ఆలయం(సెవన్ టెంపుల్స్)లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం మర్రి రాజశేఖర్రెడ్డి, మమత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా బోయిన్పల్లిలోని సెవన్ టెంపుల్స్లో సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్లు త్వరితగతిన కోలుకోవాలని పూజలు చేసినట్లు పేర్కొన్నారు. మారేడ్పల్లి, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ..రెజిమెంటల్బజార్కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చంద్రకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సికింద్రాబాద్ వైఎంసీఏ సమీపంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయంలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు పలువురు నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.వి. రాంమోహన్, సతీష్, క్రిష్టోఫర్ తదితరులు పాల్గొన్నారు.