కీసర, ఆగస్టు 8: కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో నేటి నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు నెల రోజులపాటు శ్రావణ మాసోత్సవ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ ఒక ప్రటనలో తెలిపారు. కీసరగుట్టలో నెలరోజుల పాటు జరిగే శ్రావణమాసానికి సంబంధించి ఆలయం తరపున పూర్తి ఏర్పాట్లు చేశామని చైర్మన్ తెలిపారు. ఈనెల 9న స్వామివారికి గర్భగుడిలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, 13న నాగుల పంచమి నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 15న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం, 16న స్వామివారికి నానావిధ ఫల రసాభిషేకం, 18న సత్యనారాయణస్వామి వ్రతం, 20న వరలక్ష్మీవ్రతం, 22న రాకీ పౌర్ణమి సందర్భంగా స్వామికి క్షీరాభిషేకం, 23న సోమవారం బస్వాభిషేకం, 25న మహాగణపతి స్వామికి విషేశపూజ, 30న ఇక్షు రసాభిషేకం, సెప్టెంబర్ 2న సత్యనారాయణవ్రతం, 5న మాస శివరాత్రి సందర్భంగా నానావిధ పత్రి పూజ రుద్రహోమం, 6న స్వామికి గంధాభిషేకం, 7న స్వామికి తైలాభిషేకం, అన్నపూజతో శ్రావణమాసోత్సవం పూజలు ముగియనున్నాయి.