పీర్జాదిగూడ, మే 20 : మేడ్చల్ జిల్లాలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లిలోని సర్వే నంబర్ 26ఏ, సీపీఆర్ఐ పవర్ సంస్థ, సెజ్ స్కూల్ ప్రాంగణంలో ఆర్ఏఆర్ కాలనీకి సంబంధించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు బుధవారం హైడ్రా అధికారులు అక్కడకు చేరుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సీఐ సైదులు నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమాణలను పూర్తిగా నేలమట్టం చేశారు. గత 15 సంవత్సరాలుగా రోడ్డు కబ్జా పై పోరాడుతున్నామని, హైడ్రా మూలంగా ఇన్నేళ్లకు తమ కాలనీకి సంబంధించిన రోడ్డు వినియోగంలోకి రాను ఉండడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైడ్రా అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.