కీసర, ఆగస్టు 27 : పండ్లతోటల సాగుతో రైతులకు మేలైన ఆదాయం లభిస్తుందని ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గర్పల్లిలో రవీందర్రెడ్డి అనే రైతు 3 ఎకరాల్లో పాలీహౌస్ పద్ధతిలో సాగు చేస్తున్న గెర్బెర పూలతోటను పరిశీలించారు. గెర్బర సాగుకు అయ్యే ఖర్చు, మార్కెట్ ధర, ఆదాయం, ప్రభుత్వ సబ్సిడీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సైదిరెడ్డి సాగు చేస్తున్న 5 ఎకరాల బొప్పాయి, బోగారం గ్రామంలో 10 ఎకరాల్లో సాగు చేస్తున్న మామిడి, జామ, సీతాఫలం తోటలను సందర్శించారు. మామిడిని ఏకరూప పరిమాణంలో వచ్చేలా సాగు చేయడం వల్ల ఎగుమతులకు అవకాశం ఉంటుందని వివరించారు. ఆయన వెంట జిల్లా ఉద్యాన,పట్టు పరిశ్రమశాఖ అధికారి ఎంఏ సత్తార్, సిబ్బంది ఉన్నారు.