మియాపూర్ , ఆగస్టు 7 : వందలాది కార్మిక కుటుంబాలు ఆధార పడి ఉన్న చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని విప్ గాంధీ ఆదివారం తన నివాసం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా చేనేత బీమాను ప్రవేశపెట్టిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ఏండ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన చేనేత రంగాన్ని సీఎం కేసీఆర్ విశేషంగా ప్రోత్సహిస్తూ చేనేత కార్మికులకు మరింత ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.
చేనేత వస్ర్తాలను సైతం ధరించాలని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వటం చేనేతకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలుపుతుందన్నారు.భారతీయతకు, ఫ్యాషన్కు చేనేత వస్త్రాలు ఎంతో హుందాగా ఉంటాయని ప్రతి ఒక్కరు చేనేత వస్ర్తాలను ధరించటం ద్వారా కార్మికులకు మరింత వెన్నుదన్నుగా నిలిచినట్లేనని గాంధీ పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ హయాంలోనే చేనేత వస్ర్తాలకు దేశ, ప్రపంచ ఖ్యాతి లభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేవ్ గౌడ్ , పార్టీ నేతలు సమ్మారెడ్డి, అనీల్ రెడ్డి, నాయినేని చంద్రకాంత్రావు, జిల్లా రామకృష్ణ, రామకృష్ణ గౌడ్, శ్రీనివాస్, శివరాజ్, రాజేశ్ పాల్గొన్నారు.