మేడ్చల్ మల్కాజ్గిరి : టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ ద్వారకానగర్ ఫేస్-2లో రూ. 38 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సీస వెంకటేశ్ గౌడ్, మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్, మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, అధికారులు, పలువురు టీఆర్ఎస్ నేతలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి మల్లారెడ్డి కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించారు. ప్రజలంతా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరారు.